PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది. మీరు కూడా 12వ విడత కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది మీకు శుభవార్త అవుతుంది.
ఎందుకంటే పీఎం కిసాన్ 12వ విడత సెప్టెంబర్ 30, 2022న రైతుల ఖాతాకు బదిలీ అవుతుంది. పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో రైతులకు మొదటి విడత డబ్బు అందుతుంది.
ఈసారి పీఎం కిసాన్ యోజన 11వ విడత డబ్బును 31 మే, 2022న సిమ్లాలో పీఎం మోడీ బదిలీ చేశారు. ఇప్పుడు రెండో విడత డబ్బు 30 సెప్టెంబర్ 2022న రైతుల ఖాతాకు బదిలీ అవుతుందని సమాచారం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.